ఆదివాసి నాయక్ పోడ్ సేవా సంఘం వ్యవస్థాపకుడు మద్ది రామచందర్ వర్ధంతి.
![]() |
| మద్ది రాంచందర్ కు నివాళులర్పిస్తున్న నాయక్పోడ్ సంఘం నాయకులు. |
Scv News Kasipet:--
ఆదివాసి నాయక్ పోడ్ సేవా సంఘం వ్యవస్థాపకుడు మద్ది రామచందర్ 28వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఆదివాసీ నాయకపొడ్ సేవాసంఘం మండల శాఖ ఆధ్వర్యంలో దేవాపూర్ పంచాయతీలోని నాయక గూడెంలో జరిగింది. మద్ది రామచందర్ నాయకపొడ్ జాతికి చేసిన సేవలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, మండల శాఖ అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్ కొనియాడుతూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో మండల శాఖ ఉపాధ్యక్షులు భీమిని మహేందర్ గ, సాంస్కృతిక కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్ , భూర రాజేష్ , మేకల మల్లేష్ , రాంచందర్ మరియు పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
