మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఘనంగా కాసిపేట మండలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలే జన్మదినోత్సవ వేడుకలు.

 ఘనంగా కాసిపేట మండలంలో పూలే జన్మదినోత్సవ కార్యక్రమాలు.

 

 కాసిపేట మండలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన కార్యక్రమం.


 బహుజన వర్గాల కోసం జ్యోతిరావు పూలే చేసిన త్యాగాలను, జీవిత విశేషాలను వివరిస్తున్న వక్తలు.


Scv News Kasipet:--

భారతదేశ మొట్టమొదటి గురువు మహాత్మ జ్యోతిరావు పూలే జన్మ దినోత్సవ కార్యక్రమం కాసిపేట మండలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. కాసిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో, దేవాపూర్ లో ఆదివాసి నాయక్ కోడ్ సేవా సంఘం, బుద్ధిష్టు సొసైటీ  ఆఫ్ ఇండియా మండల శాఖ ఆధ్వర్యంలో, మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మల్కపల్లి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత్ కాలనీలో వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు.

 

 మహాత్మ జ్యోతిరావు  పూలే చిత్రపటానికి పూలమాల వేస్తున్న అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జాడిపోషం 
కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే  197వ జన్మ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జాడిపోషం ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘ నాయకులు పూలమాల పూలు సమర్పించారు.  ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం సాంస్కృతిక బృందం ఇన్చార్జి గొడిసెల బాపు అధ్యక్షతన మహాత్మ జ్యోతిరావు పూలే బహుజన సమాజానికి చేసిన సేవల గురించి సమావేశం నిర్వహించారు. మహాత్మా పూలే ఈ దేశంలో బహుజన వర్గానికి చదువు నేర్పిన మొట్టమొదటి గురువు అని అన్నారు.అంబేద్కర్ సలహాదారులు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని బహుజన వర్గం చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. మండల అంబేద్కర్ సంఘం సలహాదారు దాగం మల్లేష్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయిల కృషి వల్లనే బహుజన వర్గాలు చదువు నేర్చుకుని చైతన్యవంతుల య్యారన్నారు.

 మండల అంబేద్కర్ సంఘం సలహాదారు  పల్లె మల్లయ్య మాట్లాడుతూ దేశంలో గత 2000 సంవత్సరాలుగా మనువాద బ్రాహ్మణ వర్గం 85 శాతం ఉన్న బహుజన వర్గాలను మానసిక బానిసలుగా చేసి పాలిస్తున్నాయని అన్నారు. బుద్ధుడి తదనంతరం మహాత్మా పూలే బహుజన వర్గా చైతన్యం కోసం ఎనలేని కృషి చేశాడని కొనియాడారు.

మండల కార్యదర్శి గోడిసెల సురేందర్ మాట్లాడుతూ బహుజన వర్గం అంతా పూలే ఆశయాలను కొనసాగించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మండలం అంబేద్కర్ సంఘ సహాయ కార్యదర్శి అగ్గి వెంకటస్వామి  సలహాదారులు లంక లక్ష్మణ్,రాంఠంకి వాసుదేవ్, బీసీ సెల్ ఇన్చార్జి పెద్దపల్లి శంకర్, కలవల  శ్రీనివాస్, మైనార్టీ నాయకులు సిరాజ్ ఖాన్, అంబేద్కర్ సంఘ సభ్యులు రత్నం రాజం, ఇంగు నారాయణ, గొడిసెల క్రాంతి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

దేవాపూర్ లో..

 

 మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల సమర్పిస్తున్న నాయక్ పోడు సేవా సంఘం, బుద్దిస్ట్ సొసైటీ నాయకులు. 
దేవాపూర్ మేజర్ పంచాయతీలో  ఆదివాసి  నాయక్ పోడ్ సేవా సంఘం, బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి  anss రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, మండల శాఖ అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్, బుద్ధిష్టి సొసైటీ ఆఫ్ ఇండియా మండల శాఖ అధ్యక్షుడు ముడిమడుగుల బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి రజనీ పాలేకర్, సభ్యులు శ్రీనివాస్ మహిళా కమిటీ అధ్యక్షురాలు రజనీ పాలేకర్, తిరుపతమ్మ, జ్యోతి,సక్కుబాయిలు పాల్గొని  పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కొమ్ముల బాపు, బద్ది శ్రీనివాస్ పూలేబహుజన వర్గాలకు చేసిన సేవలను జీవిత విశేషాలను వివరించారు.

 మల్క పెళ్లిలో 

 జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలు సమర్పిస్తున్న మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు.  

మల్కపెల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మల్కపెల్లి యూత్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్కపల్లి యూత్ అధ్యక్షుడు వెంకటేష్ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు మహేశ్వర్ రెడ్డి బద్ది శ్రీనివాస్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి పూలే జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు.

 భారత్ కాలని లో 

 మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన వాకర్ అసోసియేషన్.

కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ కాలనీ గ్రౌండ్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే చిత్రపటానికి  వాకర్స్ పూలమాలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంకే రవి, సిద్దయ్య శ్రీనివాస్, రమేష్, పోచం బానే వెంకన్న కిరణ్, రామచందర్ వాకర్స్ క్రీడాకారులు పాల్గొన్నారు.