దేవాపూర్ అంబేద్కర్ భవన్ లో శివాజీ 394 జయంతి కార్యక్రమం.
![]() |
| దేవాపూర్అంబేద్కర్ భవన్లో శివాజీ జయంతి కార్యక్రమం |
Scv News Kasipet:--
మరాఠా బహుజన పోరాటయోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి కార్యక్రమం ఈరోజు కాసిపేట మండలం దేవాపూర్ అంబేద్కర్ భవన్ లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయక్ పోడ్ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, అంబేద్కర్ యువజన సంఘం కోశాధికారి చిప్పకుర్తి బాపు, దేవాపూర్ బుద్ధిస్తూ సొసైటీ సభ్యులు రాజు పాలేకర్, రజనీ పాలేకర్ జ్యోతిరామ్ టెన్త్, కవిత, తిరుపతి కామ్లే ముడిమడుగుల బ్రహ్మయ్య లు శివాజీ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమ్ముల బాపు మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాష్ట్రలో బహుజన రాజ్యాన్ని స్థాపించి న బహుజన యోధుడు అని కొనియాడారు.

