మామిడిగూడెం పంచాయతీలో బీజేపీ ప్రచారం.

మామిడిగూడెంలో బిజెపి ఎన్నికల ప్రచారం.
Scv News Kasipet:--
కాసిపేట మండలం మామిడి గూడెం పంచాయతీ పరిధిలో , గోండు గూడెం, మామిడిగూడెం పంచాయతీలో ఈరోజు బిజెపి బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్రాజుల శ్రీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహిం చింది. కాసిపేట మండల అధ్యక్షుడు సురo సంపత్ కుమార్ అధ్వర్యంలో గడప గడప ప్రచారం చేసి నరేంద్ర మోడీ దేశంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరించారు. తదనంతరం మామిడి గూడెం, గోండు గూడెం వాసులు సుమారు 200 మంది అమురాజుల శ్రీదేవి, మహారాష్ట్ర MLA గంగాధర్ జోషి భారతీయ జనతాపార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల ఇంఛార్జి పులగం తిరుపతి, మండల ప్రధాకార్యదర్శి బుక్య అరవింద్, దేవానురి సంతోష్, ఉపాధ్యక్షులు రెడ్డి బాలరాజు, పెద్దపల్లి శంకర్, బీజేపీ నాయకులు నగరారపు ప్రసన్న, రత్నం కృష్ణ, చొప్పదండి విష్ణువర్ధన్, భాకి కిరణ్, బాకీ సురేష్, సంపత్, సాయి కుమార్, శ్రీనివాస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.