తహసిల్దార్ కు తుడుం దెబ్బ మండల కమిటీ సన్మానం.

కాసిపేట తహసిల్దార్ వేణుగోపాల్ ను సన్మానిస్తున్న తుడుం దెబ్బ మండల కమిటీ.
Scv News Kasipet:--
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల రెవెన్యూ కార్యాలయానికి బదిలీపై వచ్చిన తహసిల్దార్ వేణుగోపాల్ మరియు మాణిక్ రావ్ DT ని ఈరోజు కాసిపేట మండల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ కమిటీ కార్యవర్గం శాలువాలతో సన్మానం చేసింది. ఈ సందర్భంగా తుడుం దెబ్బ నాయకులు మండలంలోని ఆదివాసి రైతులకు సంబంధించిన భూసమస్యల ను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఆదివాసులకు అండగా నిలిచి అన్యాయం జరగకుండా చూడాలని తాహసిల్దార్ వేణుగోపాల్ ను కోరారు. ఈ కార్యక్రమంలో సోయం జంగు రాష్ట్ర కార్యదర్శి,మడవి వెంకటేష్ ప్రధాన కార్యదర్శి. పెంద్రం శంకర్, ఆత్రం సంజీవ్ ఉపాధ్యక్షులు, పెంద్రం ప్రభాకర్ కోశాధికారి, మడవి గంగారాం సలహాదారు, ఆత్రం మహేష్ సహాయ కార్యదర్శి, చిక్రం రాందాస్ పటేల్ పాల్గొన్నారు.