కాసిపేట మండలంలో ఎమ్మెల్యే చే పోడు భూముల పట్టాల పంపిణీ.
పోడు భూమి పట్టాలు అందజేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జిల్లా కలెక్టర్ బానోత్ ప్రశాంత్, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవి చే పోడు భూముల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండలంలోని దేవపూర్ వెంకటాపూర్, సోనాపూర్ పెద్దనపల్లి, కోమటి చేను,లంబాడి తండా పంచాయతీల పరిధిలోని గిరిజన కుటుంబాలకు పోడు భూములను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఎంపీడీవో ఎంఏ అలీ, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసిలు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

