5వ రోజుకు చేరుకున్న పంచాయతీ కార్మికుల సమ్మె.
Scv News Kasipet:--
కాజీపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద న సమ్మెలో పాల్గొన్న పంచాయత్ సిబ్బంది.
కాసిపేట మండలంలో సమ్మె సోమవారం నాటికి ఐదవ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలలో జరుగుతుంది. రేపటి నుండి అన్ని మండలాలలో నిరసన కార్యక్రమాలు చేయాల్సిందిగా జేఏసీ పిలుపునిచింది.
* జులై 11 న డా,, బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకు వినతి పత్రాలు అందజేయాలి.
* జూలై 12 న అర్ధ నగ్న ప్రదర్శనలు నిర్వహించాలి.
* జులై 13న కండ్లకు గంతలు కట్టుకొని ర్యాలీలు నిర్వహించాలి.
* జులై 14న స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేయాలి.
* జులై 15న MLA ల కార్యాలయాల వద్ద ధర్నాలు,వినతి పత్రాలు అందజేయాలి.
* జులై 16న ఆయా కేంద్రాలలో బిక్షాటన జర్పాలి.
* జులై 17న రాస్తారోకోలు నిర్వహించాలి.
* జులై 18న కుటుంబ సభ్యులతో కలసి సమ్మె
* జులై 19న అన్ని సమ్మె టెంట్లలో అన్ని పార్టీల,ప్రజా సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలి.
* జులై 20 న మండల కేంద్రములలో వంట వార్పు నిర్వహించాలని
చాగంటి వెంకటయ్య
రాష్ట్ర జేఏసీ కన్వీనర్
తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చారు.