సమస్యల పరిష్కారం కోసం పంచాయితీ సిబ్బంది సమ్మె నోటీసు.
![]() |
| పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసులు తాసిల్దార్, ఎంపీడీవో కు అందజేస్తున్న దృశ్యం. |
Scv News Kasipet:-
కాసిపేట మండలంలోని వివిధ పంచాయతీలలోని ఇబ్బంది తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని నోటీసులను ఈరోజు ఎమ్మార్వో, ఎంపీడీవో, ఏపీవో లకు అందజేశారు.పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, 11వ పి ఆర్ సి నిర్ణయించిన మినిమం వేతనం 19000 అమలు చేయాలి, ప్రమాదం జరిగినా మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలని, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులు గా నియమించుకోవాలని పలు డిమాండ్లతో వినతి పత్రాలు అందజేశారు.

