7 వ రోజు కొనసాగిన పంచాయతీ కార్మికుల సమ్మె.

కాసిపేట ఎంపీడీవో కార్యాలయం ముందు దీక్షా శిబిరంలో కూర్చున్న పంచాయతీ కార్మికులు.
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మె గురువారం నాటికి ఏడో రోజు చేరుకొంది. గ్రామ పంచాయితీ సిబ్బంది చేస్తున్న సమ్మెకు సీపీఎం మంచిర్యాల జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.కాసిపేట మండలం ఎంపిడిఓ కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సిపిఎం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సంకే రవి, గ్రామపంచాయతీ జేఏసీ నాయకులు శిలోజు మురళి మద్దతు ప్రకటించి దీక్షలో కూర్చున్నారు.