మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ ను మండల యువత అందరూ సద్వినియోగ పరుచుకోవాలి:

 రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ ను మండల యువత అందరూ సద్వినియోగ పరుచుకోవాలి:

- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ.


Scv News Kasipet:--

 కాసిపేట మండల కేంద్రంలో   మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల కృష్ణ అధ్యక్షతన   పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వేముల కృష్ణ  మాట్లాడుతూ ప్రియాంక గాంధీ గారు ప్రకటించిన యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా టీపీసీసీ తలపెట్టిన రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ లో కాసిపేట మండల యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. క్విజ్ లో పాల్గొనాలనుకునేవారు +917661899899 నెంబర్ కి మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలని రిజిస్టర్ చేసుకున్నవారికి హాల్ టికెట్ నెంబర్ కేటాయించడం జరుగుతుందని,జూన్ 18న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గం వరకు కి ఆన్లైన్ పరీక్ష ఉంటుందని,పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా లాప్ టాప్💻,రెండవ బహుమతిగా స్మార్ట్ ఫోన్📱,మూడవ బహుమతిగా ట్యాబ్,అలాగే ప్రతి అసెంబ్లీ పరిధిలో 40 కన్సోలేషన్ బహుమతులు మరియు అదేవిధంగా ప్రత్యక బహుమతిగా ప్రతి అసెంబ్లీ లో ఒక మహిళకు ఒక ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తారని ఆయన తెలిపారు.ఈ అవకాశాన్ని కాసిపేట మండల యువత తప్పకుండా సద్వినియోగం పరచుకొని ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి,ఎంపిటిసి భీమ్రావ్,ఉప సర్పంచ్ కనుకుల రాకేష్,ఎస్ సి సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి,నాయకులు కొత్త రమేష్,షకీర్,మహంకాళి,జాడి శివ,వెంకటేష్,చిలుకయ్య తదితరులు పాల్గొన్నారు..