కాసిపేట మండల కేంద్రంలో భారత జాగృతి ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ సార్ 12వ వర్ధంతి.
![]() |
| ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు సమర్పిస్తున్న భారత జాగృతి నాయకులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలో భారత జాగృతి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 12వ వర్ధంతి ఈరోజు నిర్వహించారు. భారత జాగృతి నాయకులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలోభారత జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్,అధికార ప్రతినిధి గంగాధరి రాజ్ కుమార్,కోశాధికారి కనక వంశీ కృష్ణ.కాసిపేట జీపీ అధ్యక్షులు దుర్గం శేఖర్,లంక రాకేష్,రత్నం వంశీ,SK బాబర్,గేడం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
