10వ తరగతి విద్యార్థులకు పరిక్ష సామగ్రి అందచేత.
Scv News Kasipet :--
కాసిపేట మండలం మల్కపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు గిరిజన సంక్షేమశాఖ వారు అందచేసిన పదవ తరగతి విద్యార్థుల పరిక్ష సామగ్రిని గ్రామ సర్పంచి కుడిమేత లక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. పాఠశాలలోని 32 మంది విద్యార్థులకు ఎగ్జాంప్యాడ్, పెన్నులు,పెన్సిల్,స్కేల్, కంపాక్స్, వస్తువులను అందచేయడం జరిగింది. కార్యక్రమంలో మల్కేపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహ సీనియర్ ఉపాద్యాయులు రమేష్ ,చంద్రమౌళి , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
