నిరుపేద కుటుంబాల పెండ్లిలకు ఆర్థిక సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచు దంపతులు.
![]() |
| నిరుపేద నేరెళ్ల పద్మా లక్ష్మా య్య గౌడ్ కూతురు వివాహానికి వస్తే మట్టలు పదివేల నగదు సహాయం అందిస్తున్న పల్లం గూడెం సర్పంచ్ దుస్స విజయ - చందులు |
కాసిపేట మండలంలోని పల్లం గూడ పంచాయతీ సర్పంచ్ విజయ- చందు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచినప్పటి నుండి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వివాహ సమయాల్లో ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. పల్లం గూడెం సర్పంచ్ దుస్స విజయ చందు లు. గురువారం పంచాయితీలో నిరుపేద నేరెళ్ల పద్మ- లక్ష్మయ్య గౌడ్ కూతురు పెళ్లికి పుస్తే,మట్టెలు కొత్తబట్టలు పది వేల రూపాయల నగదు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.పెళ్లి సమయంలో నిరుపేద కుటుంబాలకు మండలం లో ఏ సర్పంచ్ కూడా చేయలేని రీతిలో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలలో వెలుగులు నింపుతున్న మానవతామూర్తి మనసున్న మహారాణి సర్పంచ్ దుస్స విజయ చందులు.
తన పదవీ కాలంలో ఇప్పటివరకు తన గ్రామ పంచాయతీలో 13మంది కుటుంబాలకు లక్షా 30 వేల ఆర్థిక సహాయం తో పాటు మరో లక్ష రూపాయల విలువగల మట్టెలు, మంగళ సూత్రం, కొత్తబట్టలు వస్తువులను అందజేశారు. పంచాయితీ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు వివాహ ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేస్తూ మంచిర్యాల జిల్లా కే ఆదర్శంగా నిలుస్తున్నారు.
