మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం.

 కాసిపేట మండలంలో ఘనంగా75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు .

 ఎంపీడీవో కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఎంపిపి రోడ్డు లక్ష్మి.


 ముత్యం పల్లి పంచాయతీలో జాతీయ జెండాను ఎగురవేస్తున్న సర్పంచి ఆడే బాదు.

దేవాపూర్ లో 
 మేదరి హక్కుల సంఘం మండల అధ్యక్షుడు సర్వేశం జెండా ఆవిష్కరణ.

 లారీ యార్డ్  లో  జాతీయ జెండాను ఆవిష్కరించిన టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు వడ్లూరు మల్లేష్.

 అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేస్తున్న అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు ప్రెసిడెంట్ గసికంటి మల్లేష్.


 ధర్మ రావు పేట లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి.

 మద్దిమాడ  లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో ఎంపీపీ రోడ్డ లక్ష్మి. 

 సోమగూడెం కే పంచాయతీ లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న సర్పంచ్ సపాట్ శంకర్ సిపిఎం మంచిర్యాల జిల్లా  ప్రధాన కార్యదర్శి సంకే రవి.

 కొండాపూర్ చౌరస్తా లో జాతీయ జెండా ఆవిష్కరణ లో పాల్గొన్న సర్పంచ్ మక్కల శ్రీనివాస్. టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కంది ధర్మయ్య.


Scv News Kasipet :--

కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపిపి రోడ్డ లక్ష్మి, తహసి ల్దార్ కార్యాలయంలో తాహసిల్దార్ దిలీప్ కుమార్, సహకారసంఘ కార్యాలయంలో  సింగిల్విండో చైర్మన్ నీల,ముత్యంపల్లి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆడే బాదు జాతీయ జెండాను ఎగుర వేశారు. కాసిపేట పోలీస్ స్టేషన్లో ఎస్సై గంగారాం, దేవాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై విజయేందర్, ఓరియంట్ కార్యాలయంలో ప్రెసిడెంట్ శివకుమార్ పాండే జాతీయ జెండాను ఎగరవేశారు. దేవాపూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు ప్రెసిడెంట్ గసికంటి మల్లేష్ ,దేవాపూర్ లారీయార్డులో పట్టణ అధ్యక్షుడు వడ్లూరు మల్లేష్, మేదరి సంగం మండల అధ్యక్షు డు సర్వేశం జాతీయ జెండాను ఎగుర వేశారు. మండలంలోని 22 పంచాయితీ కార్యాలయాలలో గ్రామ సర్పంచులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కాలేజీలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఎడతెరిపి వర్షాల కారణంగా 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు  ఊరేగింపు లు లేకుండా మామూలుగా జరుపుకున్నారు.