భారీ వర్షాలకు నష్టపోయిన
పత్తి రైతులను ఆదుకోవాలి.
- బిజెపి నాయకుల
డిమాండ్.
![]() |
| కాసిపేట మండల వ్యవసాయ విస్తరణాధికారి రమ్య కు వినతి పత్రం అందజేస్తున్న బిజెపి నాయకులు. |
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఈ రోజు కాసిపేట్ వ్యవసాయ శాఖ అధికారి AEO రమ్య గారికి బిజెపి నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వ్యవసాయ అధికారులు గ్రామాలను సందర్శించి రైతుల పంట పొలాలకు వెళ్లి సర్వే చేసి నష్టపరిహారాన్ని అంచనా వేయాలని వినతిపత్రంలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులందరికీ బీహార్ అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వినతి పత్రం అందజేసిన వారిలో మంచిర్యాల జిల్లా కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అట్కపురం రమేష్ , బీసీ మోర్చా మండల అధ్యక్షులు పెద్దపల్లి శంకర్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి.సూరం సంపత్, బాకీ నరేష్ మండల ఉపాధ్యక్షులు, బాకీ కిరణ్ మండల సెక్రెటరీ, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
