పర్యావరణ పరిరక్షణలోనే
మానవ జీవితం ఆధారపడి
ఉంది.
-సామాజిక చైతన్య వేదిక
అధ్యక్షుడు పల్లె మల్లయ్య.
పర్యావరణ సమతుల్యంగా ఉండి పరి రక్షించ పడినప్పుడే ఈ భూమి మీద జీవకోటి మనుగడ సాధ్యమని పర్యావరణం మీదనే మానవ జాతి ఆధారపడి ఉందని సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య అన్నారు. ప్రపంచపర్యావరణ దినోత్సవ సందర్భంగా కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయితీలోని పకృతి వనంలో పంచాయతీ సిబ్బంది, సామాజిక చైతన్య వేదిక సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది.
ఈ సందర్భంగా పల్లె మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. హరితహారం, పల్లె పకృతివనాల ఏర్పాటు,రహదారుల కు ఇరువైపుల మొక్కలు నాటడం తో తెలంగాణలో పచ్చదనంతో పర్యావరణం పరిరక్షించు పడుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ సందర్భంగా మండలంలోని పంచాయతీలలో ప్రభుత్వ అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సర్పంచ్ లు వార్డు మెంబర్లు కూడా పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందని అన్నారు.
పంచాయతీ కార్యదర్శి కవిత మాట్లాడుతూ దేవాపూర్ పంచాయితీలో ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమం విరివిగా చేపడుతున్నామని అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పకృతి వనంలో చనిపోయిన మొక్కలు స్థానంలో మళ్లీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటడం జరిగింది అని అన్నారు.




