రైతు సంఘర్షణ సభకు
తరలిన కాసిపేట
కాంగ్రెస్ నాయకులు.
Scv News Kasipet :--
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట త్మాకంగా నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభ కు ఈరోజు కాసిపేట కాసిపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి మాజీ మంత్రివర్యులు గడ్డం వినోద్ గారి నాయకత్వం లో సుమారు 100 మంది కి పైగా కార్యకర్త లు హనుమకొండ సభకు వెళ్లారు. కొండాపూర్ చౌరస్తా లో కాంగ్రెస్ కార్యకర్త లను ఉద్దేశించి మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ మాట్లాడుతు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం రైతులు చిన్న చూపు చూస్తు కనీసం పండించిన పంటను కూడా కొనలేక రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని వచ్చే ఎన్నికల లో గద్దే దించడానికి వస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి మద్దతుగ ప్రజలు రైతులు పెద్ద సంఖ్యలో సభకు తరలి వచ్చి వచ్చి ఈ ప్రభుత్వాలని గద్దే దించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు
కోనూరు మాజీ సర్పంచ్ అప్పని ప్రభాకర్, కోమటిచేను మాజీ సర్పంచ్ జాడి శంకర్, మండల నాయకులు గుండా రాజ్ కుమార్,పల్లపు మహంకాళి, ఉడతలు కుమార్,పిడుగు మనోహర్, ఇషారాపు శారదా,కొడప అనంత రావు అప్పని శ్రీనివాస్, కుర్మా నర్సయ్యకనకయ్య,గొనె శ్రీకాంత్,బోయిని సాయికుమార్ యాదవ్,న్న రవి రాజా తదితరులు పాల్గొన్నారు.
