ఎమ్మెల్యే నిరసన దీక్షకు
మద్దతుగా తరలిన తెరాస
శ్రేణులు
SCV News Kasipet :-
కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో ని 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్లను పిలవడానికి ప్రక్రియకు మొదలు పెట్టినందుకు నిరసనగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నిరసన దీక్షకు మద్దతుగా మంగళవారం తెరాస నాయకులు బెల్లంపల్లి కి తరలి వెళ్లారు. నిరసన దీక్షలో పాల్గొని మద్దతు ప్రకటించారు. సంఘీభావం ప్రకటించిన వారిలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జెడ్ పి టి సి పల్లె చంద్రయ్య, మాజీ జెడ్పిటిసి రావు సత్తయ్య,తెరాస మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, ఎంపీటీసీలు,సర్పంచులు మండల, గ్రామ కమిటీ తెరాస నాయకులు పాల్గొన్నారు.